హనుమకొండ (ఐనవోలు) : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ నాయకులకే ప్రాధాన్యం ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేట
హనుమకొండ (ఐనవోలు) : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ నాయకులకే ప్రాధాన్యం ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిరుపేదలను విస్మరించి కాంగ్రెస్ నాయకులకే ప్రాధాన్యం కల్పిస్తున్నారని బీజేపీ మండలాధ్యక్షుడు మదాసు ప్రణయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో పారదర్శకత పాటించి, ఇళ్లు లేని అర్హులైన పేదలకే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులకు ఇళ్లు దక్కని పక్షంలో వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మదాసు ప్రణయ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గుండెకారి కోటేశ్వర్రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

COMMENTS