పరేషన్ సిందూర్ నేపథ్యంలో 27 ఎయిర్పోర్టుల్లో విమాన సర్వీసులు రద్దు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా 27 ఎయిర్పోర్టుల్లో విమాన సర్వీసులను కే
పరేషన్ సిందూర్ నేపథ్యంలో 27 ఎయిర్పోర్టుల్లో విమాన సర్వీసులు రద్దు
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా 27 ఎయిర్పోర్టుల్లో విమాన సర్వీసులను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కారణంగా గురువారం ఒక్కరోజే 430కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఇందులో ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చెందిన 5 అంతర్జాతీయ విమానాలతో సహా 90కి పైగా ఫ్లైట్లు ఉన్నాయి.
దేశ ఉత్తర, వాయువ్య, నైరుతి, మధ్య భారత్లోని పలు విమానాశ్రయాలను మే 10 వరకు తాత్కాలికంగా మూసివేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి వివిధ విమానయాన సంస్థలకు చెందిన వందలాది విమానాలు రీషెడ్యూల్ అయ్యాయి. ప్రయాణికులు తమ విమానాల తాజా స్థితిని తెలుసుకోవాలని ఎయిర్లైన్స్ సూచించాయి.

COMMENTS