ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెర
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు.
ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster Management Authority) కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అత్యవసర సమయంలో సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి – 1070, 112, 18004250101.
ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదని హెచ్చరిక జారీ చేశారు.
websoft digital media-linkedin website

COMMENTS