Godavari-Cauvery Link to Benefit Telangana with 43 TMC: Revanth Reddy

గోదావరి-కావేరి అనుసంధానం.. తెలంగాణకు 43 టీఎంసీల ప్రయోజనం: సీఎం రేవంత్

Homeతెలంగాణ

గోదావరి-కావేరి అనుసంధానం.. తెలంగాణకు 43 టీఎంసీల ప్రయోజనం: సీఎం రేవంత్

గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో తెలంగాణకు 43 టీఎంసీల నీటి ప్రయోజనం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీలకు కీలక సూచన

ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ హెచ్చరిక.. ప్రశ్నోత్తరాల సమాధానాలు లీక్ చేస్తే చర్యలు!
మోదీ క్యాబినెట్‌లో భారీ మార్పులా?.. నిర్మల సహా నలుగురికి ఉద్వాసన?.
మళ్లీ డీలిమిటేషన్ బిల్లు?.. వర్షాకాల సమావేశాల్లో హాట్ టాపిక్

గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో తెలంగాణకు 43 టీఎంసీల నీటి ప్రయోజనం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీలకు కీలక సూచనలు చేశారు.

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రజాభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలను సాధించాలని అన్ని పార్టీల ఎంపీలకు ఆయన సూచించారు. ముఖ్యంగా కేంద్రం ప్రతిపాదించిన గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.

గోదావరి నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరిగితే తెలంగాణకు అదనంగా 43 టీఎంసీల నీరు లభించే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించిన గోదావరి జలాల్లో భారీగా మిగులు నీరు అందుబాటులో ఉందని, కేంద్రం మధ్యవర్తిత్వంతో ఆ నీటిని రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించే అవకాశం ఉందని వివరించారు. ఈ అంశంపై ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించాలని సూచించారు.

అదే సమయంలో హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు, మెట్రో ఫేజ్-2, ఓఆర్‌ఆర్ దక్షిణ భాగం భూసేకరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి అనుమతులు తీసుకురావాలని సీఎం కోరారు. బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తుంగభద్ర డ్యాంలో పూడిక తొలగింపు, కాలువల ఆధునీకరణ, ఏపీ నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్‌వోసీలు, తమ్మిడిహెట్టి ప్రాజెక్టు వంటి అంశాలపై కూడా కేంద్రం సహకారం అవసరమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమన్వయ అధికారిని నియమించామని, ఎంపీలకు అవసరమైన సమాచారం వెంటనే అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మొజ్తాబా ఖమేనీపై కొత్త అనుమానాలు!

అమరావతిలో ఎకరం రూ.2.40 కోట్లు.. భూసేకరణ పరిహారంతో వెలుగులోకి వచ్చిన రేటు  

బనకచర్ల కేసులో తెలంగాణకు షాక్.. ఏపీకి నోటీసులపై సుప్రీంకోర్టు నిరాకరణ

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube