రాహుల్ గాంధీపై రేవంత్ రెడ్డి జారిన జిప్పు – సోషల్ మీడియాలో ట్రోల్స్. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు నివా
రాహుల్ గాంధీపై రేవంత్ రెడ్డి జారిన జిప్పు – సోషల్ మీడియాలో ట్రోల్స్.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన రేవంత్, తీవ్రవాదాన్ని అణచివేయడంలో దేశ సమగ్రత కోసం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ అసువులు బాసారని వ్యాఖ్యానించారు.
ఈ ప్రకటనలో రాహుల్ గాంధీ పేరును చేర్చడంతో వివాదం చెలరేగింది. రాహుల్ గాంధీ ఇంకా జీవించికున్నప్పటికీ ‘అసువులు బాసారు’ అని అనడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తూ మీమ్స్ వెల్లువెత్తాయి.
కానీ ఇది నోరుజారిన వ్యాఖ్యగా భావించాల్సిందేనని పలువురు భావిస్తున్నారు. అప్పటికప్పుడు అభిప్రాయాన్ని సరిదిద్దేందుకు సీఎం రేవంత్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు.
websoft technologies- instagram link

COMMENTS