విజయవాడ రైల్వే ఆధునికీకరణకు నీతి ఆయోగ్ ఆమోదం…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

విజయవాడ రైల్వే ఆధునికీకరణకు నీతి ఆయోగ్ ఆమోదం….

Homeఆంధ్రప్రదేశ్

విజయవాడ రైల్వే ఆధునికీకరణకు నీతి ఆయోగ్ ఆమోదం….

విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. విజయవాడ నగర అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్

మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా దౌర్జన్యం – బస్ కండక్టర్‌పై దాడి….
నేడు పోలీస్ కస్టడీకి కాకాణి…
అనంతపురం లో యువతి దారుణ హత్య…..

విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.
విజయవాడ నగర అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. రూ. 850 కోట్ల భారీ వ్యయంతో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పద్ధతిలో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది.
ఈ ప్రాజెక్టు కింద మొత్తం 1.54 లక్షల చ.మీ.ల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించనున్నారు. ప్రయాణికుల సౌకర్యాల పెంపుతో పాటు, స్టేషన్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయడం ప్రణాళికలో భాగంగా ఉంది. స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ప్రాజెక్టు అమలుతో ప్రయాణికులకు అధునాతన వసతులు, శుభ్రత, సురక్షిత వాతావరణం, పార్కింగ్, క్యాప్సుల్ లిఫ్ట్‌లు, మల్టీలెవల్ టెర్మినల్, కంప్యూటరైజ్డ్ టికెట్ బుకింగ్, వాణిజ్య స్థలాల అభివృద్ధి వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. పాత టర్మినల్స్‌ను తగిన విధంగా పునరుద్ధరించి, కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు అమలుతో విజయవాడ నగర అభివృద్ధిలో కీలకంగా మారనున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక, దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌లో విజయవాడ స్టేషన్‌కు ప్రముఖ స్థానం దక్కుతుందని పేర్కొన్నారు.

Nakashatra Agency -instagram post

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube