శీర్షిక:మైనార్టీ గురుకులాల్లో టీచర్ కంటే డ్రైవర్ జీతమే ఎక్కువ వివరాలు:తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్టైం ఉద్యోగ
శీర్షిక:
మైనార్టీ గురుకులాల్లో టీచర్ కంటే డ్రైవర్ జీతమే ఎక్కువ
వివరాలు:
తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్టైం ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత విధించిన ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. జేఎల్, పీజీటీ, టీజీటీ టీచర్ల జీతాలు గణనీయంగా తగ్గించగా, డ్రైవర్ల వేతనం టీచర్ల కంటే ఎక్కువగా ఉండటంపై సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో విద్యా నాణ్యత, ఉపాధ్యాయుల గౌరవం దెబ్బతింటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మైనార్టీ గురుకులాల్లో టీచర్ కంటే డ్రైవర్ జీతమే ఎక్కువ
తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్టైం ఉద్యోగుల వేతనాల్లో భారీ కోతలు విధించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీచర్ల జీతాలను పెంచాల్సింది పోయి ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల జేఎల్ (జూనియర్ లెక్చరర్) వేతనం రూ.35 వేల నుండి రూ.23,400కి, పీజీటీ వేతనం రూ.31,395 నుండి రూ.18,200కి, టీజీటీ వేతనం రూ.28,660 నుండి రూ.18,200కి తగ్గింది.
ఇక నాన్-టీచింగ్ విభాగంలో పనిచేసే డ్రైవర్లకు మాత్రం రూ.19,500 వేతనం నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. దీంతో టీచర్ల వేతనం డ్రైవర్ల కంటే తక్కువగా మారింది. ఈ పరిణామంపై గురుకులాల్లోని ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీలో 204 గురుకులాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3,756 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వీరికి రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో 30% పీఆర్సీ వర్తింపజేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆర్డర్స్ కొనసాగించకుండా వేతనాల్లో కోతలు విధించడం వల్ల ఉద్యోగులు “ఇదేనా ప్రజాపాలన?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 1437 ప్రకారం, ఉపాధ్యాయుల పునరుద్ధరణతో పాటు వేతనాల కోతలు కూడా అమల్లోకి వచ్చాయి. దీంతో కాంట్రాక్ట్ టీచర్లు ‘బతికేది ఎలా?’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం గురుకులాల్లో విద్యా నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

COMMENTS