హైదరాబాద్: మే 22 తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు తెలిపిన వివరాల
హైదరాబాద్: మే 22
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించబడతాయని అధికారులు వెల్లడించారు.
పరీక్షల ప్రారంభ సమయంలో విద్యార్థులకు కొంత ఉపశమనంతో అవకాశం ఇచ్చారు. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు ఆలస్యం అయిన విద్యార్థులను కూడా అనుమతిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
పరీక్షల విద్యార్థులు హాల్ టికెట్లు మరియు అవసరమైన సర్టిఫికెట్లను తీసుకురావాల్సిందిగా సూచించారు. కేంద్రాల్లో కట్టుదిట్టమైన నిబంధనలు అమలులో ఉండనున్నాయి.

websoft -web Development Service

COMMENTS