హైదరాబాద్, జూలై 2: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుత
హైదరాబాద్, జూలై 2:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
మంగళవారం నాటికి ఇప్పటికే ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు అధికారులు తెలిపారు.
బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇవి ప్రజలకు ఇబ్బందికరంగా మారవచ్చునని పేర్కొన్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు.
గడచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో 6.10 సెం.మీ వర్షపాతం నమోదై అత్యధికంగా వర్షం పడిన ప్రాంతంగా నిలిచింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణశాఖ సూచించింది. ఆయా జిల్లాల్లో అధికారులు బ alerta న ఏర్పాట్లను ముమ్మరం చేయాలని సూచించారు.
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS