సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం. సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ను సిట్ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం. సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ను సిట్ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది.
ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతంగా ముందుకు తీసుకెళ్తుండగా, తాజాగా పరారీలో ఉన్న సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ మరణానంతరం జరిగిన పరిణామాల్లో సురేష్ పాత్ర కీలకంగా ఉన్నట్లు అనుమానిస్తున్న సిట్ అధికారులు ఆయనను విస్తృతంగా విచారిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా సాయికృష్ణ మృతదేహాన్ని తరలించడం, కేసు వెలుగులోకి రాకుండా ప్రయత్నాలు జరిగాయా అనే అంశాలపై సిట్ దృష్టి సారించింది. లాకప్ డెత్ జరిగిన తర్వాత సీఐ నాగరాజుకు సురేష్ సహకరించినట్లు ప్రాథమిక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. అలాగే పోలీసు వ్యవహారాల్లో సురేష్ జోక్యం ఎంతవరకు ఉందో, నాగరాజుతో అతని సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అధికారులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు సాయికృష్ణ కుటుంబ సభ్యులతో సురేష్ సంప్రదింపులు జరిపిన అంశంపై కూడా సిట్ ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. కుటుంబ సభ్యులతో రాయబారం నడిపారా? కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయా? అనే కోణాల్లో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉండొచ్చన్న అనుమానంతో అధికారులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.
ఇప్పటికే పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నానిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. వారిద్దరి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కేసు దర్యాప్తు విస్తరిస్తున్న నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అదేవిధంగా డీసీపీ కృష్ణకాంత్ పటేల్, టాస్క్ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి, ఏసీపీ మానస తదితర అధికారులతో కూడా సిట్ ప్రత్యేకంగా మాట్లాడింది. సాయికృష్ణపై నమోదైన పాత కేసులు, నేర చరిత్ర, పోలీసు వ్యవహారాలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తూ దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా సిట్ చర్యలు చేపడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి…
ఆల్మట్టి వివాదానికి ముగింపు? ముగ్గురు సీఎంల సఖ్యతపై భారీ ఆశలు
హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. నేడు పాతబస్తీలో భారీ ఆంక్షలు!
తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS