కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు: దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మోదీ సర్కారు సంకల్పం.
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ప్రతి ఒక్క ఉగ్రవాదిని మట్టుబెడతాం.
నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఏ ఉగ్రవాది తప్పించుకోలేడు.
ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమంతా భారత్తో నిలుస్తోంది.
ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పోరాటం ఆగదు.
ఉగ్రదాడికి పాల్పడినవారికి తగిన శిక్ష విధిస్తాం.
ఈశాన్య ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రాంతాలు లేదా కశ్మీర్లోని ఉగ్రవాద ప్రాంతాలు కావచ్చు, ప్రతిదానికి మేము గట్టి సమాధానం ఇస్తాం.
ఈ పిరికిపంద దాడి ద్వారా తాము పెద్ద విజయం సాధించినట్లు ఎవరైనా భావిస్తుంటే ఒక విషయం అర్థం చేసుకోండి. ఇది మోదీ ప్రభుత్వం ఎవరూ తప్పించుకోలేరని గ్రహించాలి.
దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా సంకల్పం.

COMMENTS