బీహార్లోని కతిహార్లో ఘోర ప్రమాదం: పెళ్లి నుంచి వస్తూ 8 మంది మృతి, ఇద్దరికి గాయాలు బీహార్లోని కతిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సో
బీహార్లోని కతిహార్లో ఘోర ప్రమాదం: పెళ్లి నుంచి వస్తూ 8 మంది మృతి, ఇద్దరికి గాయాలు
బీహార్లోని కతిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి సమయంలో సమేలి బ్లాక్ ఆఫీస్ సమీపంలోని జాతీయ రహదారి (NH-31)పై వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ను ఎదురుగా వస్తున్న ఓ కారు (SUV) బలంగా ఢీకొంది. ఈ భయంకరమైన ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన వారంతా ఒక పెళ్లి వేడుకలో పాల్గొని కారులో తిరిగి సుపాల్కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరణించిన వారందరూ పురుషులేనని కతిహార్ ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు మరియు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన ఇద్దరిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

COMMENTS