అనర్హులకు లబ్ధి చేకూరకుండానే అమలు లక్ష్యం హైదరాబాద్: నేడు ప్రారంభమవాల్సిన రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభాన్ని తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. దరఖాస
అనర్హులకు లబ్ధి చేకూరకుండానే అమలు లక్ష్యం
హైదరాబాద్: నేడు ప్రారంభమవాల్సిన రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభాన్ని తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. దరఖాస్తులను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మంత్రుల బృందం నివేదికలో పేర్కొంది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.
పకడ్బందీగా అమలుకు సీఎం దిశానిర్దేశం.
అనర్హులకు ఒక్కరికి కూడా లబ్ధి చేకూరకూడదని, పకడ్బందీగా వ్యవహరించాలి అని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
క్యాబినెట్ చర్చ అనంతరం ముందుకు.
రాజీవ్ యువ వికాసంపై మరింత స్పష్టత కోసం క్యాబినెట్లో చర్చించాకే తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ప్రయోజనం చేకూర్చేలా పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేసేలా ప్రణాళిక రూపొందించనున్నారు.

COMMENTS