ఖమ్మంలో మున్నేరు రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి. ఖమ్మం: మున్నేరు నదికి వచ్చే వరదల నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపడం కోసం చేపట్
ఖమ్మంలో మున్నేరు రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి.
ఖమ్మం: మున్నేరు నదికి వచ్చే వరదల నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపడం కోసం చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సోమవారం పరిశీలించారు. సుమారు రూ. 680 కోట్లతో ఈ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

COMMENTS