హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఖైరతాబాద్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంద
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఖైరతాబాద్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో హైదరాబాద్లో ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. పోలింగ్ స్టేషన్ నుండి బీఆర్కేఆర్ భవన్ వరకు ఆంక్షలు విధించారు. ఓటర్లు మరియు ఎన్నికల సిబ్బందిని మినహాయించి ఇతరులను ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు.

COMMENTS