అత్తింటి వేధింపుల నుంచి IAS వరకూ – సవితా ప్రధాన్ కథ!

అత్తింటి వేధింపుల నుంచి IAS వరకూ – సవితా ప్రధాన్ కథ!

Homeజాతీయం

అత్తింటి వేధింపుల నుంచి IAS వరకూ – సవితా ప్రధాన్ కథ!

వేధింపులకు తలొగ్గకుండా ఇద్దరు పిల్లలతో పోరాడి IAS అయిన సవితా ప్రధాన్ స్ఫూర్తిదాయక జీవితం. హిమ్మత్‌వాలీ లడ్కియా ఛానల్‌తో ధైర్యం నూరుతోంది. ఒక్క క్షణం.

ప్రధాని మోదీని కలిసిన మహిళా క్రికెట్ జట్టు | ‘నమో’ జెర్సీ బహూకరించిన టీమిండియా.
కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో కలకలం
ఇరాన్ యుద్ధంపై అమెరికా-ఇజ్రాయెల్ అభిప్రాయ భేదాలు

వేధింపులకు తలొగ్గకుండా ఇద్దరు పిల్లలతో పోరాడి IAS అయిన సవితా ప్రధాన్ స్ఫూర్తిదాయక జీవితం. హిమ్మత్‌వాలీ లడ్కియా ఛానల్‌తో ధైర్యం నూరుతోంది.

ఒక్క క్షణం.. అదే ఆమె జీవితం మార్చిన క్షణం! ఆ క్షణానికి ముందు సవితా ప్రధాన్ ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. కానీ ఆ క్షణంలో వచ్చిన ఆలోచనతో ఆమె జీవితం మలుపు తిరిగింది. అత్తింటి నిరంతర వేధింపులు, ఒంటరి పోరాటం మధ్య రెండు పిల్లల్ని చూసుకుంటూ, ఆకలి తట్టుకుంటూ, పడిన కష్టాల్ని ఓ దిక్కుగా మలచిన ఆమె.. చివరికి ఐఏఎస్‌ అధికారి అయింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన సవితా ప్రధాన్, ఈరోజు గ్వాలియర్‌, చంబల్ ప్రాంతాల అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ హోదాలో సేవలందిస్తోంది. కానీ ఈ స్థాయికి రావడం ఆమెకు తేలిక కాలేదు. ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్ననాటి దుస్థితి కన్నీళ్లు తెప్పించేలా ఉంటుంది. బీడీ ఆకులు ఏరుతూ జీవనం సాగించిన సవితా.. చిన్నప్పటి నుంచి చదువు పట్ల ఆసక్తి లేకపోయినా, స్కాలర్‌షిప్‌ డబ్బుల కోసమే పాఠశాలలో చేరింది. తొలిసారి పదవ తరగతి పూర్తి చేసిన తన ఊరి అమ్మాయిగా గుర్తింపు పొందింది.

అయితే బాల్య వివాహం రూపంలో వచ్చిన దురదృష్టం ఆమె జీవితాన్ని నరకంగా మార్చింది. అత్తింటిలో పనిమనిషిలా వదిలేసిన కుటుంబం, భర్త నుంచి రాత్రింబవళ్లు శారీరక, మానసిక వేధింపులు.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలన్న స్థితికి చేరుకుంది. కానీ తన పిల్లల కోసం బతకాలని నిర్ణయించుకుంది. లోదుస్తుల్లో రొట్టెలు దాచుకొని బాత్‌రూమ్‌లో తినాల్సిన పరిస్థితుల నుంచి, తనను తాను మార్చుకుంది.

కేవలం రూ.2,000తో ఇంటిని వదిలి బయటికొచ్చిన సవితా, బ్యూటీ పార్లర్‌లో అసిస్టెంట్‌గా పని చేయడం మొదలుపెట్టింది. ఇంటి వంట పనులు, ట్యూషన్లు, ఏదైనా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల మధ్య చదువు ఆపలేదు. BA, MA Public Administrationలో యూనివర్సిటీ ఫస్ట్‌ అయిన ఆమె, ఒకరోజు UPSC నోటిఫికేషన్ చూసి జీవితాన్ని మార్చేసింది.
రేయింబవళ్లు చదివి మొదటి ప్రయత్నంలోనే IAS సాధించింది. 24 ఏళ్లకే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ గా నియమితులైంది.

ఇప్పుడైతే తన జీవితాన్నే పాఠాలుగా మార్చి, ‘హిమ్మత్‌వాలీ లడ్కియా’ అనే యూట్యూబ్‌ ఛానల్ ద్వారా మిగతా ఆడపిల్లలకి ప్రేరణనిస్తున్నది. “బాధల్ని మౌనంగా భరించకుండా, వాటిని బలంగా మార్చుకోవాలి” అనే సందేశాన్ని ఆమె చాటుతోంది.

సవితా ప్రధాన్‌ కథ ఏ సాంప్రదాయ కథ కాదు.. ఇది లక్షలాది ఆడపిల్లలకు మార్గదర్శకంగా నిలిచే వాస్తవ జీవిత గాధ.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube Channel.

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube