ఏషియా కౌన్సిల్కు దూరంగా BCCI – భారత్ జట్లు ఆసియా కప్కు గుడ్బై? న్యూఢిల్లీ, మే 19 (జాతీయ క్రీడా వార్తలు): పాకిస్తాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేప
ఏషియా కౌన్సిల్కు దూరంగా BCCI – భారత్ జట్లు ఆసియా కప్కు గుడ్బై?
న్యూఢిల్లీ, మే 19 (జాతీయ క్రీడా వార్తలు):
పాకిస్తాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏషియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్వహించే ఈవెంట్లకు దూరంగా ఉండాలని BCCI ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా ACCకి తెలియజేసింది.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా పాక్కు చెందిన మంత్రి మోహ్సిన్ నఖ్వీ ACC అధ్యక్షుడిగా ఉన్న విషయం చెప్పబడుతోంది. దీంతో వచ్చే నెల జరగనున్న వుమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్ అలాగే సెప్టెంబర్లో జరగనున్న మెన్స్ ఏషియా కప్లలో భారత జట్లు పాల్గొనే అవకాశాలు లేవన్న అంచనాలు వేయబడుతున్నాయి.
ఈ పరిణామం అంతర్జాతీయ క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల ప్రభావం క్రికెట్పై పడుతుండటం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

websoft technologies-Digital Marketing Training Course

COMMENTS