సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను డీఎంఆర్సీ తాత్కాలికంగా మూసివేసింది. భద్రతా కారణాలతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సేవలు నిలిపివేశార
సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను డీఎంఆర్సీ తాత్కాలికంగా మూసివేసింది. భద్రతా కారణాలతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సేవలు నిలిపివేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) గురువారం ఉదయం 7:30 గంటల నుంచి నగరంలోని 16 కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ స్టేషన్లలో ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
మూసివేసిన స్టేషన్లలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంభా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థ్, జనపథ్, మండి హౌస్, కేంద్ర సచివాలయం, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం ఉన్నాయి. అయితే రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్ఛేంజ్ సౌకర్యం మాత్రం అందుబాటులో ఉంటుందని డీఎంఆర్సీ వెల్లడించింది.
గత నాలుగు రోజుల వ్యవధిలోనే మూడోసారి భారీ సంఖ్యలో మెట్రో స్టేషన్లను మూసివేయడంతో వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం కూడా 17 మెట్రో స్టేషన్లను మూసివేసిన డీఎంఆర్సీ, సాయంత్రం తిరిగి సేవలను పునరుద్ధరించింది. తాజాగా మరోసారి మూసివేత నిర్ణయం తీసుకోవడంతో ప్రత్యామ్నాయ రవాణాపై ప్రయాణికులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నెల 20న సీజేపీ ఇచ్చిన ‘పార్లమెంట్ మార్చ్’ పిలుపు తర్వాత జంతర్మంతర్ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు భారీ సంఖ్యలో చేరుతుండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసిన అధికారులు మెట్రో సేవలపై పరిమితులు విధించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇక మెట్రో స్టేషన్ల మూసివేతపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. విద్యార్థులు, నిరసనకారులతో చర్చించి సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిపోయి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని ఆరోపిస్తున్నాయి. భద్రతా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే మెట్రో సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్యూర్ ఇందిరమ్మ ఇళ్లు.. ఆధార్తోనే దరఖాస్తు, ఫోన్ నుంచే ఫీజు చెల్లింపు!
హైదరాబాద్కు మరో ఫ్లైఓవర్.. రూ.345 కోట్లతో ట్రాఫిక్కు చెక్!
పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు!
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS