ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నిలిచింది. బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికె
ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నిలిచింది. బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో, CSK పది మ్యాచ్లలో 8వ ఓటమిని చవిచూసింది. ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్లలో గెలిచినా ప్లే ఆఫ్స్కు చేరుకునే అవకాశం లేదు.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన CSK 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ కింగ్స్ బౌలర్ చాహల్ 19వ ఓవర్లో 4 వికెట్లు తీసి CSK భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ఈ ఓటమితో CSK ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. చెన్నైలోని తమ సొంత మైదానమైన చెపాక్లో ఒక సీజన్లో అత్యధిక మ్యాచ్లు ఓడిపోయిన జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో ఇప్పటివరకు చెపాక్లో ఆడిన 6 మ్యాచ్లలో ఐదింట్లో CSK ఓడిపోయింది.
మరోవైపు, పంజాబ్ కింగ్స్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఆ జట్టుకు 13 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన నాలుగు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్లో గెలిచినా ప్లే ఆఫ్స్కు చేరుకునే అవకాశం ఉంది. రెండు మ్యాచ్లలో గెలిస్తే టాప్-2లో నిలిచే అవకాశం కూడా ఉంది.

COMMENTS