కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ను, మరో మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను వా
కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ను, మరో మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది.
ప్రస్తుతం ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది.
ప్రభుత్వ యంత్రాంగం సహాయకచర్యలు ముమ్మరం చేసింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

COMMENTS