రూ.7 వేల కోట్ల భూకుంభకోణం.. హరీష్ రావు సంచలన ఆరోపణలు

రూ.7 వేల కోట్ల భూకుంభకోణం.. హరీష్ రావు సంచలన ఆరోపణలు

Homeతెలంగాణ

రూ.7 వేల కోట్ల భూకుంభకోణం.. హరీష్ రావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్ లచ్చమ్మకుంట భూములపై రూ.7 వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైడ్రాపై కూడా విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో లచ్చమ్

అవినీతి నిరూపిస్తే రాజీనామా.. హరీశ్‌కు పొన్నం సవాల్
కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో కలకలం
జగిత్యాల సభతో కేసీఆర్ రీఎంట్రీ.. రేవంత్ కౌంటర్

హైదరాబాద్ లచ్చమ్మకుంట భూములపై రూ.7 వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైడ్రాపై కూడా విమర్శలు చేశారు.

హైదరాబాద్‌లో లచ్చమ్మకుంట చెరువు భూముల వివాదం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేస్తూ.. రూ.7 వేల కోట్ల భారీ భూకుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నాదర్‌గుల్ సమీపంలోని లచ్చమ్మకుంట చెరువు భూములను తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. బాధితులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై కూడా హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. “చెవులు వినిపిస్తలేవా?” అంటూ ప్రశ్నిస్తూ వెంటనే లచ్చమ్మకుంట ప్రాంతానికి రావాలని డిమాండ్ చేశారు. లేకపోతే తానే ఎమ్మెల్యేలతో కలిసి అక్కడికి వెళ్తానని సవాల్ విసిరారు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రా పెద్దలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూములను కాపాడతామని అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. నాదర్‌గుల్‌లో దళితుల భూములను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ భూముల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని తెలిపారు.

ఇక ఈ ఆరోపణలను సంబంధిత సంస్థ ఖండించింది. కోహినూర్ గ్రూప్ సంస్థ ప్రతినిధులు ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా ఆయన కుమారుడు హర్ష రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భూమి రాజా శివ్‌రాజ్ బహదూర్ వారసులకు చెందిన ప్రైవేట్ ఆస్తి అని తెలిపారు. 2015లో సుప్రీంకోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వచ్చిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో లచ్చమ్మకుంట భూముల వివాదం రాజకీయంగా మరింత వేడెక్కింది.

రూ.7 వేల కోట్ల భూకుంభకోణం ఆరోపణలు, హైడ్రా పాత్ర, రాజకీయ విమర్శలతో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ వ్యవహారంపై అధికారుల చర్యలు ఎలా ఉంటాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలువేగంగా అందించే Digital Prime News‌ తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube