ఢిల్లీలో భారీ భూకంపం భారత ఉపఖండాన్ని కుదిపేస్తున్న ప్రకృతి న్యూఢిల్లీ, జూలై 9 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రి భారీ భూకం
ఢిల్లీలో భారీ భూకంపం భారత ఉపఖండాన్ని కుదిపేస్తున్న ప్రకృతి
న్యూఢిల్లీ, జూలై 9 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. భూకంపం ప్రభావంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఇదే సమయంలో ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇది ఒక్కసారిగా జరిగిన ఘటన కాదు. గత నెలన్నరగా భారత ఉపఖండంలోని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ రిక్టర్ స్కేల్పై 5.0కి పైగా తీవ్రతతో నమోదవుతున్నాయి. దీనిని ఒక రకం ప్రకృతి హెచ్చరికగా భావిస్తున్నారు వాతావరణ నిపుణులు.
భూకంప కేంద్రం పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. దీని వల్ల ఉత్తర భారతదేశం, హిమాలయ ప్రాంతం తీవ్ర ప్రభావానికి గురవుతోంది. ఇక వరుసగా జరుగుతున్న ప్రకంపనలు భవనాల భద్రతపై, మానవ జీవితాలపై తీవ్రమైన సవాలుగా మారుతున్నాయి.
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS