నేటితో ఎన్డీఏ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తి – అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడుస్తున్న కేంద్రం. భారత దేశ రాజకీయం మరో కీలక మైలురాయిని అందుకుంది. నేటితో
నేటితో ఎన్డీఏ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తి – అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడుస్తున్న కేంద్రం.
భారత దేశ రాజకీయం మరో కీలక మైలురాయిని అందుకుంది. నేటితో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ, 2019లో తిరిగి ఘన విజయం సాధించి రెండోసారి గద్దెనెక్కింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మూడోసారి అధికారాన్ని కొనసాగిస్తూ తన స్థిరతను మరోసారి చాటుకుంది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “దేశం అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు సాగుతోంది. 2029 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మా లక్ష్యం. ప్రజల ఆశీర్వాదంతో ఈ దిశగా మేము కట్టుబడి పనిచేస్తున్నాం” అని మోదీ ట్వీట్ చేశారు.
మూడు పర్యాయాలు అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ మోడీ నేతృత్వంలో పలు కీలక సంస్కరణలు చేపట్టింది. మొదటి టర్మ్లో స్వచ్ఛ భారత్, జనధన్ యోజన వంటి పథకాలతో పునాది వేసిన కేంద్రం, రెండో టర్మ్లో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA), వ్యవసాయ చట్టాలు వంటి పెద్ద నిర్ణయాలను తీసుకుంది. మూడో టర్మ్లో “వికసిత భారత్ @ 2047” లాంటి దూరదృష్టి ప్రణాళికలపై దృష్టి కేంద్రీకరించింది.
ఎన్డీఏ పాలనలో దేశ అభివృద్ధికి తోడ్పడిన విషయాలుగా మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఉజ్వల యోజన వంటి పథకాలు ప్రస్తావించవచ్చు. అయితే, కొన్ని ఆందోళనకరమైన చర్చనీయాంశాలూ ఈ కాలంలో ప్రస్తావనకు వచ్చాయి. అయినప్పటికీ, మోదీ నేతృత్వం ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించడంలో విజయవంతమవుతున్నట్లు కనిపిస్తోంది.

COMMENTS