రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30న సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. ఇతర నిర్ణయాల వివరాలు ఇవే. త
రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30న సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. ఇతర నిర్ణయాల వివరాలు ఇవే.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో కీలక శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. జూన్ 30న ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించనున్న రైతు సమ్మేళనం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిధుల విడుదలకు అధికారికంగా తేదీ ఖరారైంది.
కేబినెట్ సమావేశంలో రైతులకు సంబంధించిన మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఏడు రకాల సన్న ధాన్యాలకు బోనస్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు అధిక లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి తక్కువ ధాన్యం సేకరిస్తోందని సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసిన కేబినెట్, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
ఎరువుల కొరతపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణకు కేటాయించాల్సిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో తయారయ్యే యూరియాలో అధిక భాగాన్ని తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని, ఐఆర్ఎఫ్సీ నుంచి రావాల్సిన రుణాలను విడుదల చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా జూన్ 21న నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే వీబీ-జీ ఆర్ఏఎం జీ అంశంపై అధ్యయనం చేసేందుకు మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జూన్ 25లోపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి…
ఐపీఎస్ సునీల్ కుమార్కు హైకోర్టు షాక్.. ‘ఎప్పుడు సరెండర్ అవుతారు?’
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జులై 1 నుంచి 11% ఫిట్మెంట్ అమలు
డీఎంకేకు మరో షాక్? విజయ్ టీవీకే వైపు ఎండీఎంకే అడుగులు!
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి !

COMMENTS