హైదరాబాద్-పుణె బుల్లెట్ ట్రైన్ మార్గంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాప్లతో శంషాబాద్, మహేశ్వరం రైతుల్లో భూసేకరణ భయాలు నెలకొన్నాయి. అధికారులు కీలక
హైదరాబాద్-పుణె బుల్లెట్ ట్రైన్ మార్గంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాప్లతో శంషాబాద్, మహేశ్వరం రైతుల్లో భూసేకరణ భయాలు నెలకొన్నాయి. అధికారులు కీలక వివరణ ఇచ్చారు.
హైదరాబాద్–పుణె బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు తెలంగాణలోని శంషాబాద్, మహేశ్వరం మండలాల రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో బుల్లెట్ రైల్ హబ్ నిర్మాణం చేపట్టనున్నట్లు, అలాగే ఆ ప్రాజెక్టు కోసం ఆరు గ్రామాల పరిధిలో భారీ స్థాయిలో భూసేకరణ జరుగుతుందంటూ సోషల్ మీడియాలో గూగుల్ ఎర్త్ మ్యాప్లు వైరల్ కావడంతో స్థానికుల్లో కలకలం నెలకొంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) ఇంకా అధికారికంగా విడుదల కాకముందే ఈ ప్రచారం సాగడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న మ్యాప్ల ప్రకారం బహదూర్గూడ, సయ్యద్గూడ, పెద్దగోల్కొండ, నందిపల్లి, రషీద్గూడ, మహేశ్వరం మండలంలోని మంఖాల్ గ్రామాల మీదుగా బుల్లెట్ ట్రైన్ మార్గం వెళ్లనున్నట్లు చూపిస్తున్నారు. ఈ అలైన్మెంట్ సుమారు 60 మీటర్ల వెడల్పుతో ఉంటుందని, దాని కోసం దాదాపు 2 వేల ఎకరాల భూమి అవసరమవుతుందనే ప్రచారం రైతుల్లో మరింత ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం తమ భూముల్లో గణనీయమైన భాగాన్ని కోల్పోయామని, మరోసారి భూసేకరణ జరిగితే వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ప్రచారంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదని రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్ తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గూగుల్ ఎర్త్ మ్యాప్లు తుది ప్రాజెక్టు అలైన్మెంట్ కాదని, ప్రజలు వాటిని నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర సర్వేలు, సాంకేతిక పరిశీలనలు, ప్రజలకు అధికారిక నోటిఫికేషన్లు తప్పనిసరిగా ఉంటాయని వివరించారు.
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) సాధారణంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల కోసం ఒకటి కంటే ఎక్కువ అలైన్మెంట్లను పరిశీలిస్తుందని అధికారులు తెలిపారు. ప్రాథమిక అధ్యయనాల కోసం కన్సల్టెన్సీ సంస్థలు గూగుల్ ఎర్త్ ఆధారంగా తాత్కాలిక మార్గాలను రూపొందించడం సహజ ప్రక్రియేనని, వాటినే తుది మార్గంగా భావించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు పుకార్లను నమ్మవద్దని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్లో కొత్త స్కైవాక్లు.. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్కు గుడ్న్యూస్!
దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్న నేత మోదీ: పవన్ కల్యాణ్
రీల్స్లోనే క్షమిస్తారా?.. కేసులూ ఎత్తేస్తారా? మోదీకి సీజేపీ ప్రశ్న
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS