ఢిల్లీ పేలుడు ఘటన.. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ ఉన్నతస్థాయి సమావేశం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరే
ఢిల్లీ పేలుడు ఘటన.. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ ఉన్నతస్థాయి సమావేశం
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
కేంద్ర కేబినెట్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. దీన్ని కిరాతక ఉగ్ర ఘాతుకంగా అభివర్ణిస్తూ, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని కేబినెట్ తీర్మానించింది. ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించింది.
సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ — “దేశ భద్రతకు ముప్పుగా నిలిచే ఏ శక్తినీ సహించం. ఈ ఘటనకు కారణమైన వారిని త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, ఇదే సమావేశంలో కేంద్ర కేబినెట్ ఎగుమతి ప్రోత్సాహక మిషన్కు ఆమోదం తెలిపింది. ఆరేళ్లపాటు రూ. 25,060 కోట్లు కేటాయిస్తూ ఎగుమతుల ఎకో సిస్టమ్ బలోపేతానికి చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS