Kavitha's Maoist Remark Sparks Political Debate in Telangana

అడవిలో అన్నలు లేరు.. టీఆర్‌ఎస్‌లో ఉన్నారు: కవిత సంచలన వ్యాఖ్యలు

Homeతెలంగాణ

అడవిలో అన్నలు లేరు.. టీఆర్‌ఎస్‌లో ఉన్నారు: కవిత సంచలన వ్యాఖ్యలు

సింగరేణి పర్యటనలో కవిత చేసిన ‘అడవిలో అన్నలు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు’ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. సింగరేణి కార్మికుల సమస్యలపై చేపట్టిన ‘బాయిబా

కేటీఆర్‌ అమెరికా పర్యటన ముగిసింది…..
కొండా సురేఖ క్షమాపణలు.. నాగార్జున సంచలన నిర్ణయం.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆక్స్‌ఫర్డ్ ఆహ్వానం….

సింగరేణి పర్యటనలో కవిత చేసిన ‘అడవిలో అన్నలు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు’ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

సింగరేణి కార్మికుల సమస్యలపై చేపట్టిన ‘బాయిబాట’ పర్యటనలో టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంచిర్యాల జిల్లాలో రెండో రోజు పర్యటన సందర్భంగా ఆర్‌కే-7 గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించేందుకు ప్రయత్నించిన కవితను పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ఆమె గేట్‌ను తోసుకుని లోపలికి వెళ్లి కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తనను అడ్డుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో కాంగ్రెస్ నేతలు సింగరేణి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, ఇప్పుడు కార్మికుల సమస్యలు తెలుసుకోవడాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

అనంతరం మాట్లాడిన కవిత మావోయిస్టుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అడవిలో అన్నలు ఉండేవారని, అప్పట్లో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసేవారని అన్నారు. ప్రస్తుతం అడవిలో అన్నలు లేరని, తమను ప్రశ్నించే వారు లేరని సింగరేణి యాజమాన్యం భావిస్తోందని విమర్శించారు. అయితే అప్పటి పోరాట స్ఫూర్తి కలిగిన వారంతా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నారని, కార్మికుల హక్కులకు భంగం కలిగితే తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

కవిత వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు దారితీయగా, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రతిస్పందనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సమస్యలు, కార్మిక హక్కులు, ప్రభుత్వ వైఖరి వంటి అంశాలు మరోసారి రాజకీయ కేంద్రబిందువుగా మారాయి.

ఈ వార్తలు కూడా చదవండి…

స్కూల్ బస్సులపై ఆర్టీవో కొరడా.. 6 బస్సులకు చలాన్లు

ఏసీబీ దాడుల్లో భారీ నగదు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో అక్రమాస్తుల వెలుగు

బిల్డర్స్‌తో కోమటిరెడ్డి భేటీ.. రూ.4వేల కోట్ల బకాయిలపై కీలక చర్చ

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube