భారత్–యుకె వాణిజ్య భాగస్వామ్యం చారిత్రాత్మకం: ప్రధాని మోదీ ముంబై, అక్టోబర్ 9: యునైటెడ్ కింగ్డమ్ (ఇంగ్లాండ్) భారతదేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య మి
భారత్–యుకె వాణిజ్య భాగస్వామ్యం చారిత్రాత్మకం: ప్రధాని మోదీ
ముంబై, అక్టోబర్ 9: యునైటెడ్ కింగ్డమ్ (ఇంగ్లాండ్) భారతదేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇదేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్–యుకె వాణిజ్య భాగస్వామ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా ఆయన పేర్కొన్నారు.
మోదీ, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్తో కలిసి ముంబైలో పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, “ఇది భారత్–యుకె సంబంధాలను మరింత బలోపేతం చేసే మైలురాయి. ఇరు దేశాలు కలిసి ప్రపంచ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించగలవు” అని అన్నారు.
బ్రిటన్ ప్రధాని స్టార్మర్ మాట్లాడుతూ, “జూలైలో కుదుర్చుకున్న భారత్–యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించిన తర్వాత మేము కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం. ఇది భారతదేశానికి కూడా ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద వాణిజ్య ఒప్పందం” అని అన్నారు.
ఈ ఒప్పందం ద్వారా ఇరుదేశాల మధ్య ఏటా £25.5 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే లక్ష్యం ఉందని తెలిపారు. దీని వల్ల భారత్–యుకె వాణిజ్యం వేగవంతం కావడంతో పాటు వ్యాపార వ్యయాలు తగ్గుతాయని స్టార్మర్ పేర్కొన్నారు.
బ్రిటన్ ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ ఒప్పందం ద్వారా భారత్ బ్రిటిష్ ఉత్పత్తులపై సగటు టారిఫ్ 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గించనుంది. దీంతో శీతల పానీయాలు, సౌందర్య సాధనాలు, కార్లు, వైద్య పరికరాలు వంటి ఉత్పత్తులు భారత మార్కెట్లో చౌకగా లభ్యమవుతాయని పేర్కొంది.
ఈ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు ఉపాధి, పెట్టుబడుల వృద్ధికి దోహదం చేస్తుందని రెండు దేశాల ప్రధానిలు స్పష్టం చేశారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్సైట్ మరియు యూట్యూబ్ చానెల్ను ఫాలో అవ్వండి.
Visit: www.digitalprimenews.in
Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
COMMENTS