Hyderabad RTC EV Expansion: 2,800 Electric Buses Planned by 2027

గ్రేటర్‌లో రయ్‌రయ్‌ ఈవీ బస్సులు.. 2027 తర్వాత డీజిల్ బస్సులకు గుడ్‌బై?

Homeతెలంగాణ

గ్రేటర్‌లో రయ్‌రయ్‌ ఈవీ బస్సులు.. 2027 తర్వాత డీజిల్ బస్సులకు గుడ్‌బై?

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ వేగవంతం. ప్రస్తుతం 500 ఈవీ బస్సులు, 2027 నాటికి 2,800 బస్సుల లక్ష్యంతో ఆర్టీసీ ముందుకు సాగుతోంది. హైదరాబాద్ నగ

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. నేడు పాతబస్తీలో భారీ ఆంక్షలు!
సికింద్రాబాద్ స్కైవాక్‌కు గ్రీన్ సిగ్నల్.. ఆర్టీసీ అడ్డంకి
జలమండలి జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు.. కోట్ల ఆస్తులు వెలుగులోకి

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ వేగవంతం. ప్రస్తుతం 500 ఈవీ బస్సులు, 2027 నాటికి 2,800 బస్సుల లక్ష్యంతో ఆర్టీసీ ముందుకు సాగుతోంది.

హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థలో భారీ మార్పులకు టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుడుతోంది. పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను వేగంగా పెంచుతోంది. ప్రస్తుతం నగరంలోని వివిధ రూట్లలో 500 ఈవీ బస్సులు సేవలందిస్తుండగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 500 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా 240 డీజిల్ బస్సులను రెట్రోఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

ప్రస్తుతం లింగంపల్లి-మెహిదీపట్నం, హయత్‌నగర్-లింగంపల్లి, సికింద్రాబాద్-కొండాపూర్, సికింద్రాబాద్-పటాన్‌చెరు, కోఠి-పటాన్‌చెరు, ఎన్‌జీవో కాలనీ-మెహిదీపట్నం, సికింద్రాబాద్-మణికొండ వంటి ప్రధాన మార్గాల్లో ఈవీ బస్సులు నడుస్తున్నాయి. అలాగే మియాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 22, సికింద్రాబాద్ నుంచి విమానాశ్రయానికి 40 ఎలక్ట్రిక్ బస్సులు ప్రతిరోజూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులు, మెరుగైన ఆదాయం కారణంగా ఈవీ బస్సుల వినియోగాన్ని మరింత విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ఆర్టీసీ ప్రణాళికల ప్రకారం వచ్చే రెండేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 2,800 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 1,500 బస్సులను అద్దె ప్రాతిపదికన, మరో 1,300 బస్సులను ప్రభుత్వ సహకారంతో తీసుకురావాలని భావిస్తున్నారు. నగరంలోని 26 డిపోల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. హయత్‌నగర్, హెచ్‌సీయూ, మియాపూర్, కంటోన్మెంట్, రాణిగంజ్ వంటి ప్రధాన డిపోలు ఇప్పటికే ఈవీ బస్సుల కేంద్రాలుగా మారుతున్నాయి.

అత్యంత కీలకంగా, 2027 డిసెంబర్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ బస్సులను పూర్తిగా నిలిపివేసి కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలనే లక్ష్యంతో ప్రభుత్వం, ఆర్టీసీ ముందుకు సాగుతున్నాయి. ఈ నిర్ణయం అమలైతే హైదరాబాద్ దేశంలోనే అత్యంత పెద్ద ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ కలిగిన నగరాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. కాలుష్య నియంత్రణ, ఇంధన వ్యయాల తగ్గింపు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం వంటి ప్రయోజనాలతో ఈ ప్రాజెక్టు నగర రవాణా రంగంలో కీలక మైలురాయిగా మారనుంది.

ఈ వార్తలు కూడా చదవండి…

Iran అమెరికాకు తగిన బుద్ధి చెబుతాం.. దాడులపై ఇరాన్ ఆగ్రహం!

సాయికృష్ణ కేసులో మరో ట్విస్ట్.. సీఐ నాగరాజు స్నేహితుడు అదుపులో

ఆల్మట్టి వివాదానికి ముగింపు? ముగ్గురు సీఎంల సఖ్యతపై భారీ ఆశలు

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube