అన్నమయ్య జిల్లా, మే 16: మదనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రైవేట్ బస్ కండక్టర్పై దాడికి
అన్నమయ్య జిల్లా, మే 16: మదనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రైవేట్ బస్ కండక్టర్పై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
సాధారణంగా బెంగళూరుకు ప్రైవేట్ బస్సులు నడుపుతున్న నవాజ్ బాషా, బస్సు టైమింగ్స్ విషయంలో కండక్టర్తో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ వాగ్వాదం తీవ్రంగా మారి, కండక్టర్పై శారీరక దాడికి దారి తీసిందని అక్కడి ప్రయాణికులు తెలిపారు.
దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఈ ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.


COMMENTS