ఫ్యాక్టరీలో పేలుడు.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు! వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి ఘోర ప్రమ
ఫ్యాక్టరీలో పేలుడు.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు!
వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నేస్ విపరీతంగా వేడెక్కి ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనలో ఆలీ, రషీద్ అనే ఇద్దరు కార్మికులు గాయపడగా, వారిని వెంటనే సోమాజిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆలీ దుర్మరణం చెందగా, రషీద్ చికిత్స పొందుతున్నాడు.
నియమావళిని పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పరిగి ఎస్సై మోహన్ కృష్ణ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించాయా లేదా అన్న అంశంపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనతో స్థానికులలో ఆందోళన నెలకొంది. ఫ్యాక్టరీలో భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!
#DigitalPrimeNews #TeamIndia #WomensWorldCupFinal #IndiaVsAustralia #HarmanpreetKaur #JemimahRodrigues #WomenCricketHistory #CricketNews #TeluguNews #SportsUpdates #BreakingNews

COMMENTS