హైదరాబాద్ నగరంలోని ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) తన రోగులకు మరింత వేగంగా.. సులభంగా సేవలు అందించడాని
హైదరాబాద్ నగరంలోని ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) తన రోగులకు మరింత వేగంగా.. సులభంగా సేవలు అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. ఆసుపత్రికి వచ్చే రోగులు ఓపీ కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడకుండా.. తమంతట తాము ఓపీ టోకెన్ పొందేలా ‘కియోస్క్’ పేరుతో రెండు అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుండటంతో.. ఈ సేవలను మరిన్ని విభాగాలకు విస్తరించాలని ఆసుపత్రి యంత్రాంగం యోచిస్తోంది.
ఇటీవల.. ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిమ్స్లో రోగులే స్వయంగా తమ రక్తపోటు (బీపీ), నాడి (పల్స్) వంటి ప్రాథమిక ఆరోగ్య వివరాలను తనిఖీ చేసుకునేందుకు వీలుగా బీపీ టెల్లింగ్ మెషిన్లను (బీటీఎం) కూడా ఏర్పాటు చేశారు. ఈ పరికరాల రాకతో నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత వేగంగా.. సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ యం

COMMENTS