కుక్కగోరు గుచ్చుకొని యువకుడు మృతి – రేబిస్ డేంజర్ అలర్ట్ అహ్మదాబాద్లో ఒక పోలీసు అధికారి కుక్క గోరు గుచ్చుకోవడంతో రేబిస్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కో
కుక్కగోరు గుచ్చుకొని యువకుడు మృతి – రేబిస్ డేంజర్ అలర్ట్
అహ్మదాబాద్లో ఒక పోలీసు అధికారి కుక్క గోరు గుచ్చుకోవడంతో రేబిస్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కలకలం రేపుతున్న వేళ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇలాంటి విషాదం చోటుచేసుకుంది.
ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన 25 ఏళ్ల సందీప్ రెండు నెలల క్రితం ఒక కుక్కపిల్లను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కుక్కను మచ్చిక చేసుకునే క్రమంలో సందీప్ తండ్రిని కుక్క కరిచింది. అదే సమయంలో అక్కడే ఉన్న సందీప్ చేతికి కుక్క కాలి గోరు గుచ్చుకుంది. తండ్రికి వెంటనే చికిత్స చేయించిన సందీప్ తన గాయాన్ని చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేశాడు.
గాయం మానిపోయిన కొన్ని రోజుల తర్వాత సందీప్లో రేబిస్ లక్షణాలు కనబడటం మొదలయ్యాయి. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, బలహీనత, అయోమయం వంటి సమస్యలతో ఆస్పత్రిలో చేరిన అతడు, సెప్టెంబర్ 22న చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబంలోనే కాకుండా గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
⚠️ వైద్యుల హెచ్చరిక
రేబిస్ వైరస్ మెదడు మరియు నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కుక్క కాటు లేదా గోరు గుచ్చిన తర్వాత లక్షణాలు కనిపించడానికి వారాల నుంచి నెలల సమయం పడుతుంది. ఒకసారి జ్వరం, తలనొప్పి, గందరగోళం, నీటిని చూసి భయపడటం (హైడ్రోఫోబియా) వంటి లక్షణాలు వస్తే చికిత్స చాలా కష్టమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

COMMENTS