26 రోజుల నిరాహార దీక్షకు సోనమ్ వాంగ్చుక్ ముగింపు పలికారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అనంతరం దీక్ష విరమించగా ప్రధాని మోదీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిం
26 రోజుల నిరాహార దీక్షకు సోనమ్ వాంగ్చుక్ ముగింపు పలికారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అనంతరం దీక్ష విరమించగా ప్రధాని మోదీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షకు ముగింపు పలికారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, వైద్యులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సూప్ తాగి ఆయన దీక్షను విరమించారు. అనంతరం స్పందించిన వాంగ్చుక్.. “సూప్ రుచి బాగుంది.. కానీ ఆకలి రుచి ఇంకా గొప్పది” అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీశాయి.
దీక్ష విరమణకు ముందు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రభుత్వం తరఫున పలు కీలక హామీలు ప్రకటించారు. ఢిల్లీలోని జంతర్మంతర్లో శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై, అలాగే జూలై 20న నిర్వహించిన పార్లమెంట్ మార్చ్లో పాల్గొన్న నిరసనకారులపై కేసులు నమోదు చేయకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీ నివారణకు అవసరమైన చర్యలపై ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందని చెప్పారు.
ఇటీవల నీట్ సహా పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని జేపీ నడ్డా వెల్లడించారు. ఈ హామీల అనంతరం వాంగ్చుక్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ దీక్షను ముగించారు.
విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కేనని వాంగ్చుక్ పేర్కొన్నారు. అయితే ప్రతి ఉద్యమం పూర్తిగా శాంతియుతంగా సాగాలని, ఎలాంటి హింసకు తాను మద్దతివ్వనని స్పష్టం చేశారు. సంఘవిద్రోహ శక్తులు ఉద్యమాలను దుర్వినియోగం చేసుకునే అవకాశం ఇవ్వకూడదని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన భార్య గీతాంజలి ఆంగ్మోకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి క్షణం తనకు అండగా నిలిచారని భావోద్వేగంగా చెప్పారు.
ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమించడంపై స్పందించారు. ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వైద్యుల సూచనలు పాటించాలని, ఆరోగ్యాన్ని పూర్తిగా పునరుద్ధరించుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరాన్ నో.. ట్రంప్కు మరో షాక్!
నేడు తెలంగాణలో విద్యాసంస్థల బంద్.. పరీక్షలు వాయిదా, స్కూళ్లకు సెలవు
ఏపీకి భారీ వరం.. NH-42 అభివృద్ధికి రూ.679.71 కోట్ల మంజూరు
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS