మూడవ రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మూడవ రోజుకు చేరుకుంది. నిన్న ఆయన, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ
మూడవ రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మూడవ రోజుకు చేరుకుంది. నిన్న ఆయన, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మరియు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ అయిన కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో కీలక సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ పునఃసంఘటనపై ప్రధానంగా చర్చించారని సమాచారం.
విస్తరణపై నిర్ణయం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ను ఈరోజు మళ్లీ కలవనున్నారని సమాచారం.
ieee Live project – youtube video

COMMENTS