రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో CDS, త్రివిధ దళాధిపతుల భేటీ – ఆపరేషన్ సిందూర్ వివరాలు వివరింపు. న్యూఢిల్లీ, మే 14: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో CDS అనిల్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో CDS, త్రివిధ దళాధిపతుల భేటీ – ఆపరేషన్ సిందూర్ వివరాలు వివరింపు.
న్యూఢిల్లీ, మే 14:
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో CDS అనిల్ చౌహాన్తో పాటు త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఇటీవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన కీలక వివరాలను రాష్ట్రపతికి వివరించారు.
ఈ సందర్భంగా, పాకిస్తాన్పై జరిగిన దాడిలో ఎలా తీవ్ర నష్టం కలిగింది, ఎన్ని ఉగ్రవాదులు హతమయ్యారు, దౌత్యపరంగా ఆ ప్రభావం ఎంతవరకు వ్యాపించింది అనే అంశాలపై పూర్తి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఉగ్రవాదంపై త్రివిధ దళాలు ప్రదర్శించిన ధైర్యం, వ్యూహాత్మక చర్యలను రాష్ట్రపతి భారీగా ప్రశంసించారు. సైనికుల ప్రదర్శన పట్ల అభినందనలతో పాటు, భద్రతా వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ముఖ్యాంశాలు:
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో CDS, త్రివిధ దళాధిపతుల భేటీ.
ఆపరేషన్ సిందూర్ వివరాలు వివరణ.
పాక్పై దాడిలో జరిగిన ధ్వంసంపై సమగ్ర నివేదిక.
రాష్ట్రపతి త్రివిధ దళాల ధైర్యాన్ని అభినందించారు.

COMMENTS