సీఎం రేవంత్, ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ, బుల్లెట్ ట్రైన్ వంటి కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోదీ సహకారం కోరారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ హామీ. CM Reva
సీఎం రేవంత్, ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ, బుల్లెట్ ట్రైన్ వంటి కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోదీ సహకారం కోరారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ హామీ.
CM Revanth Reddy discusses Telangana Model: తెలంగాణ మోడల్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. గుజరాత్ మోడల్ను ముందుకు తీసుకెళ్లేందుకు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించినట్లు గుర్తుచేసిన రేవంత్, అదే విధంగా తెలంగాణ మోడల్కు కూడా ప్రధానమంత్రి మోదీ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్లమెంట్లోని పీఎంవోలో జరిగిన సుమారు 30 నిమిషాల సమావేశంలో సీఎం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు.
ప్రత్యేకంగా రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగానికి కేబినెట్ అనుమతి ఇవ్వాలని, దక్షిణ భాగ పనులకు వెంటనే అనుమతులు జారీ చేయాలని ప్రధానికి వినతి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించేందుకు కేంద్రం ముందడుగు వేయాలని కోరారు. హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ హై స్పీడ్ కారిడార్ అభివృద్ధికి కేంద్రం చొరవ చూపాలని దృష్టికి తీసుకువచ్చారు.
హైదరాబాద్–బెంగళూరు–చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు టైగర్ రిజర్వ్ మీదుగా ఫోర్ లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి మొత్తం 162.5 కిలోమీటర్ల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపిందని, రూ. 43,848 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును కేంద్ర–రాష్ట్ర జాయింట్ వెంచర్గా ఆమోదించాలని స్పష్టం చేశారు.
గతంలో గుజరాత్ మోడల్కు వచ్చిన సహకారంతో అక్కడ అభివృద్ధి సాధ్యమైందని గుర్తుచేసిన సీఎం, అదే విధంగా తెలంగాణ మోడల్కు మోదీ అండగా ఉంటే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి సాధించగలదని తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు.
పార్లమెంట్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పలువురు నేతలను కలుసుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఆహ్వానాలను అందజేశారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS