ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా.. హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్‌ కుట్ర? - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా.. హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్‌ కుట్ర?

Homeజాతీయం

ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా.. హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్‌ కుట్ర?

హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్‌ కుట్ర భగ్నం హైదరాబాద్‌ సిటీ బ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ పేలుళ్లకు ఐసిస్‌

ఆపరేషన్ సింధూర్: భారత్ దిమ్మతిరిగే ప్రతీకారం..
పాకిస్తాన్ మరో షాక్..
నేపాల్‌ సరిహద్దుల్లో ఉగ్ర టెన్షన్…

హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్‌ కుట్ర భగ్నం
హైదరాబాద్‌ సిటీ బ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ):
హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ పేలుళ్లకు ఐసిస్‌ (ISIS) కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కుట్రను ఎన్‌ఐఏ (NIA), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్ ఇంటెలిజెన్స్‌ పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. ఏపీలోని విజయనగరంలో చోటుచేసుకున్న ఒక శంకాస్పద కార్యకలాపాన్ని గమనించిన అధికారులు, విచారణను కొనసాగించగా హైదరాబాద్‌తో సంబంధాలూ వెలుగులోకి వచ్చాయి.
సౌదీ అరేబియాలో ఉన్న ఐసిస్‌ అనుబంధ సంస్థల నుంచి ఆదేశాలు లభించగా, వీటి ఆధారంగా భారత్‌లో కుట్రకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. విజయనగరానికి చెందిన 29 ఏళ్ల సిరాజ్ ఉర్ రెహ్మాన్‌పై అనుమానంతో నిఘా వర్గాలు గమనించాయి. అతడి ఆన్‌లైన్‌ చాటింగ్స్‌, ముడిసరుకుల కొనుగోళ్లు మొదలైనవి అనుమానాస్పదంగా ఉండటంతో అతని ఇంటిపై దాడులు నిర్వహించారు. ఇంట్లో పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలు లభించాయి.
హైదరాబాద్‌ టార్గెట్‌గా పెట్టారా?
సిరాజ్‌ను అరెస్ట్‌ చేసిన అనంతరం అతని దగ్గర నుంచి హైదరాబాద్‌కు ఉన్న లింక్‌ బయటపడింది. బోయిగూడకు చెందిన లిఫ్ట్‌ ఆపరేటర్‌ సయ్యద్ సమీర్‌ (28)తో సిరాజ్‌ చర్చలు జరిపినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ తెలంగాణ పోలీసులకు తెలియజేయగా, కౌంటర్ ఇంటెలిజెన్స్‌ అధికారులు సమీర్‌ను అదుపులోకి తీసుకొని విజయనగరానికి తరలించారు.
ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో పేలుళ్లకు ప్రణాళిక రూపొందించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన ముడిసరుకులు ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసినట్టు గుర్తించారు. కానీ ఈ విషయాన్ని అధికారికంగా పోలీసులు ఇప్పటి వరకు ప్రకటించలేదు.
ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారమేనా?
ఇటీవలి పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చర్యలు చేపట్టింది. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదులు దేశీయంగా యువతను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు అంటున్నాయి. పాకిస్తాన్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న అనుబంధ సంస్థలు, సానుభూతిపరులు ఇలాంటి కుట్రలకు తోడ్పాటును అందిస్తున్నారని అనుమానం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతానికి ఇద్దరు నిందితుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

websoft Digital Media-Digital Marketing

websoft Digital Media-Digital Marketing

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube