కూకట్‌పల్లిలో కల్తీ మద్యం కల్లోలం – 6 మంది మృతి

కూకట్‌పల్లిలో కల్తీ మద్యం కల్లోలం – 6 మంది మృతి

Homeతెలంగాణ

కూకట్‌పల్లిలో కల్తీ మద్యం కల్లోలం – 6 మంది మృతి

కూకట్‌పల్లిలో కల్తీ మద్యం కల్లోలం – మృతుల సంఖ్య ఆరుకు చేరింది హైదరాబాద్, జూలై 9 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ మద్యం మృత్యు త

తెలంగాణ-కజకిస్తాన్ కీలక ఒప్పందం: గవర్నర్-రాయబారి భేటీ
నిమ్స్‌ ఆసుపత్రిలో.. క్యూ లైన్లతో పని లేదు.. క్షణాల్లోనే ఓపీ టోకెన్..
తెలంగాణలో భారీ వర్షాలు – జిల్లాల్లో రికార్డు వర్షపాతం…

కూకట్‌పల్లిలో కల్తీ మద్యం కల్లోలం – మృతుల సంఖ్య ఆరుకు చేరింది

హైదరాబాద్, జూలై 9 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ మద్యం మృత్యు తాండవం నడుపుతోంది. కల్తీ మద్యం సేవించడంతో మృతుల సంఖ్య ఆరుగురికి పెరిగింది. మృతుల్లో స్వరూప(56), తులసీరామ్(47), బొజ్జయ్య(55), నారాయణమ్మ(65), మౌనిక(25), నారాయణ ఉన్నారు. వీరంతా హెచ్ఎంటీ హిల్స్ ప్రాంతంలోని సాయిచరణ్ కాలనీ నివాసితులుగా గుర్తించారు.

ఇంకా పలువురు బాధితులు గాంధీ హాస్పిటల్‌, నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా, ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వం తీవ్రంగా స్పందించి విచారణ కమిటీ వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ మద్యం వలన ఈ తరహా ఘోరాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube