Ind vs Pak: మ్యాచ్ జరగనివ్వండి.. ఎందుకంత తొందర? .. భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు! జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22
Ind vs Pak: మ్యాచ్ జరగనివ్వండి.. ఎందుకంత తొందర? .. భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్పై ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. భారత సైన్యం “ఆపరేషన్ సింధూర్” నిర్వహించి పాక్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో క్రీడా రంగంపైనా ప్రభావం పడింది. సెప్టెంబర్ 14న దుబాయ్లో జరగనున్న ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.
సుప్రీంకోర్టు స్పందన
ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తక్షణ విచారణకు నిరాకరించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది, “మ్యాచ్ ఆదివారం ఉంది. శుక్రవారం విచారణ జరగకపోతే పిటిషన్ నిరుపయోగం అవుతుంది” అని వాదించారు. దీనిపై జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం “ఇంత తొందర ఎందుకు? మ్యాచ్ ఆదివారమేనా? మేము ఏం చేయగలం? అది జరగనివ్వండి. మ్యాచ్ కొనసాగాలి” అని వ్యాఖ్యానించింది.
పిటిషన్లో ఏముంది?
లా విద్యార్థులు ఉర్వశి జైన్ ఆధ్వర్యంలో దాఖలైన ఈ పిటిషన్లో, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో క్రికెట్ ఆడటం దేశ గౌరవానికి, ప్రజల మనోభావాలకు విరుద్ధమని పేర్కొన్నారు. సైనికులు ప్రాణత్యాగం చేసిన సమయంలో పాక్తో క్రీడలు నిర్వహించడం తప్పుడు సందేశాన్ని ఇస్తుందని వాదించారు.
భావోద్వేగాలకు దెబ్బ
పిటిషనర్లు పేర్కొన్నట్లు, “మన సైనికులు ప్రాణత్యాగం చేస్తున్న సమయంలో పాక్తో క్రికెట్ ఆడటం, ఉగ్రవాద బాధితుల కుటుంబాల మనోభావాలను దెబ్బతీస్తుంది. దేశ గౌరవం, పౌరుల భద్రత వినోదం కంటే ముఖ్యమైనవి” అని స్పష్టం చేశారు.
దేశంలో రాజకీయ వాదనలు
భారత్-పాక్ మ్యాచ్పై దేశంలో రాజకీయ వాదనలు కూడా రగిలాయి. శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, “మేము ఈ మ్యాచ్ను వ్యతిరేకిస్తాం. సిందూర్ రక్షా అభియాన్ను నిర్వహిస్తాం. మన సైనికులు ప్రాణత్యాగం చేస్తున్న సమయంలో పాక్తో క్రీడలు ఆడటం దేశద్రోహం” అని విమర్శించారు.

COMMENTS