సింధూ ఒప్పందం పునరుద్ధరించమంటూ పాకిస్తాన్ భారత్కు లేఖ భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంతో సింధూ నదిపై పరిస్థితి వేడెక్కింది. భారత్, పాకిస్తాన్ మధ్య
సింధూ ఒప్పందం పునరుద్ధరించమంటూ పాకిస్తాన్ భారత్కు లేఖ
భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంతో సింధూ నదిపై పరిస్థితి వేడెక్కింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ లో నీటి కొరత తీవ్రమైంది.
వ్యవసాయ అవసరాలే కాక, త్రాగునీటి దుకాణాలు బాగా ఖాళీ కావడంతో భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ లేఖ రాసి మళ్లీ నీళ్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. గతంలో హూంకరించిన పాకిస్తాన్ ఇప్పుడు శాంతంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత్ ఇప్పటికే ప్రకటించినట్లే, కాల్పుల విరమణకు, సింధూ ఒప్పందానికి సంబంధం లేదని స్పష్టం చేస్తూ నిర్ణయం కొనసాగిస్తుందని తెలిపింది. ఈ అంశంపై భారత్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

COMMENTS