ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. పాలమూరు-రంగారెడ్డి సహా కీలక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చే
ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. పాలమూరు-రంగారెడ్డి సహా కీలక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా వివిధ సాగునీటి ప్రాజెక్టులు, రహదారి అభివృద్ధి పనులకు అవసరమైన శాఖాపరమైన అనుమతులపై సీఎం వినతిపత్రం సమర్పించారు.
సమావేశంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, ఎస్ఆర్వీ ఆర్ డిండి ప్రాజెక్టు, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే కేంద్ర అనుమతులు కీలకమని వివరించినట్లు సమాచారం.
అదేవిధంగా రాష్ట్రంలో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు కూడా పాల్గొన్నారు. కేంద్ర అనుమతులకు సంబంధించిన అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 ప్రైవేట్ కాలేజీలపై కేసు నమోదు
మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి.. మెటాకు పార్లమెంట్ కమిటీ అల్టిమేటం
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి.. 14 మంది సిబ్బంది సురక్షితం
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS