ఏపీ శాసనమండలిలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనకు దిగింది. మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావే
ఏపీ శాసనమండలిలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనకు దిగింది. మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల తొలిరోజే డీఎస్సీ అంశంపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ చర్చ చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. డీఎస్సీ వ్యవహారంపై విచారణ జరిపించాలని నినాదాలు చేశారు.
వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దల సభలో ఈ తరహా నిరసనలు చేయడం సరికాదని, సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని అన్నారు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత కూడా పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విచారణకు డిమాండ్ చేశారు. అయితే ఆయనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వడంపై మంత్రి నాదెండ్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డీఎస్సీపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని, గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు డీఎస్సీ నిర్వహించలేదని ఆరోపించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటే వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయించారని అచ్చెన్నాయుడు విమర్శించారు. డీఎస్సీ అంశంపై నాలుగు రోజుల పాటు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కష్టపడి పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులను రాజకీయ వివాదాల్లోకి లాగడం సరికాదని అన్నారు.
వైసీపీ సభ్యుల నినాదాలు కొనసాగడంతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు మండలి చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. డీఎస్సీ నియామకాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ఈ వివాదం రానున్న మండలి సమావేశాల్లో మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం.. ఎగువ నుంచి నిలిచిన వరద ప్రవాహం
సింధూ జలాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వార్నింగ్.. భారత్కు రెడ్లైన్!
సీఎం రేవంత్ ములుగు పర్యటన.. విజయవంతం చేయాలని పైడాకుల అశోక్ పిలుపు
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS